ఒడిశా : ఆంద్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి మల్కన్ గిరి ఎస్పీ ప్రహల్లాద్ మీనా తెలిపిన వివరాలు ప్రకారం మల్కన్ గిరి మరియు కోరాపుట్ జిల్లాల సరిహద్దులోని బడిలి కొండపై ఒక పెద్ద మావోయిస్టు శిబిరం ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. తరువాత ఎస్వోజీ, డీవీఎఫ్ మరియు సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతంలో గాలింపు నిర్వహించామని బుధవారం బాగా పొద్దుపోయాక గాలింపు బలగాలు మావోయిస్టులు నిర్వహిస్తున్న శిభిరానికి చేరుకోగానే మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు.
దీంతో పోలీసులు ప్రతిగా కాల్పులు జరిపారు. సుమారు రెండు గంటల పాటు మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ శిబిరం నుంచి తప్పించుకున్నారు. ఈ ఎదురు కాల్పులు నుంచి ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సబ్యుడు జాంబ్రి పోలీసులు తెలిపారు. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో తప్పించుకున్న మావోయిస్టులు కోసం ఉమ్మడి గాలింపు నిర్వహిస్తున్నట్లు మల్కన్గిరి జిల్లా ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు శిబిరం నుంచి ఒక తుపాకీ, 6 లైవ్ కాట్రిడ్జ్లు, 4 డిటోనేటర్లు, 2 వాకీ-టాకీ, 11 నక్సల్ కిట్లు, యూనిఫామ్లు మరియు పోస్టర్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.