చెన్నై తొలి విక్టరీ ..బెంగుళూరు పై చెన్నై విక్టరీ

చెన్నై తొలి విక్టరీ ..బెంగుళూరు పై చెన్నై విక్టరీ

వరంగల్ టైమ్స్ , స్పోర్ట్స్ డెస్క్ : ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలిసారి విజయం నమోదు చేసుకుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. 23 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు రాబిన్ ఊతప్ప (88), శివమ్ దూబే (95 నాటౌట్) రాణించడంతో ఏకంగా 216 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు ప్రారంభంలోనే తడబడింది. కెప్టెన్ డుప్లెసిస్ (8), అనూజ్ రావత్ (12), కోహ్లీ (1) ముగ్గురూ తీవ్రంగా నిరాశ పరిచారు.చెన్నై తొలి విక్టరీ ..బెంగుళూరు పై చెన్నై విక్టరీఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్ వెల్ ( 11 బంతుల్లో 26) కొంత ఆఖలు కలిగించినా, జడేజా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కాసేప్ షాబాజ్ నదీమ్ ( 41), సూయష్ ప్రభు దేశాయి ( 34 ) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. అదే సమయంలో కావాల్సిన రన్ రేట్ భారీగా పెరగకుండా కూడా జాగ్రత్త పడ్డారు. చివరిలో వానిందు హసరంగ (7), ఆకాష్ దీప్ (0) ఔటైనప్పటికీ దినేష్ కార్తీక్ ( 34) క్రీజులో ఉండటంతో బెంగళూరు విజయం సాధిస్తుందన్న ఆశలు ఉండే.

ఇలాంటి సమయంలో బ్రావో బౌలింగ్ లో భారీ షాట్ ఆడేందుకు డీకే ప్రయత్నించాడు. సరిగ్గా బౌండరీ లైన్ మీద దాన్ని జడేజా అందుకోవడంతో డీకే వెనుతిరిగాడు. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ గా ఉన్న చెన్నై అభిమానులు దాంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 9 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేయగల్గింది. చెన్నై బౌలరల్లలో మహీష్ తీక్షణ 4 , జడేజా 3 వికెట్లు తీయగా, డ్వేన్ బ్రావో, ముకేష్ చౌదరి చెరో వికెట్ తీసుకున్నారు.