వడ్ల సేకరణకు కార్యాచ‌ర‌ణ రూపొందించాలన్న సీఎస్ 

వడ్ల సేకరణకు కార్యాచ‌ర‌ణ రూపొందించాలన్న సీఎస్

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : యాసంగింలో పండించిన మొత్తం వ‌రి ధాన్యాన్ని రాష్ట్ర‌మే పూర్తిగా కొనుగోలు చేస్తుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిన్న ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, వ్య‌వ‌సాయ, మార్కెటింగ్, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు వ‌డ్ల సేక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు.వడ్ల సేకరణకు కార్యాచ‌ర‌ణ రూపొందించాలన్న సీఎస్ ధాన్యం కొనుగోళ్ల పురోగ‌తిని జిల్లాల వారీగా ప్ర‌తీ రోజూ ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌త్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను సీఎస్ ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించి జిల్లాల్లో ధాన్యం సేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు ప్రారంభించాల‌ని చెప్పారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు రోజూ కనీసం నాలుగు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.

గ‌తంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎస్ ఆదేశించారు. ప్ర‌తి కొనుగోలు కేంద్రానికి ప్ర‌త్యేక అధికారిని నియ‌మించి, ప‌ర్యవేక్షించాల‌న్నారు. గన్నీ బ్యాగుల సేకరణపై కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించి, పర్యవేక్షించాలన్నారు. గన్నీ బ్యాగుల సేకరణపై కూడా దృష్టి సారించాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏవైనా సమస్యలు వస్తే అధికారులు వెంటనే పరిష్కరించాలని సీఎస్ సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.