తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి విషెష్

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి విషెష్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి సీఎం కేసీఆర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని, ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని సీఎం ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని సీఎం అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోలేని తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరనం నెలకొల్పామన్నారు. తెలంగాణ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటామని, రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలంగా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని సీఎం కోరారు.