ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్ 

ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికిన కేసీఆర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన వారిలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్మీ, నేవీ అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. అనంతరం భారత సైనికుల గౌరవ వందనాన్ని ద్రౌపది ముర్ము స్వీకరించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ముర్ము నేడు హైదరాబాద్ కు వచ్చారు. నేటి నుంచి 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నేడు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి, ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లారు. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.