రూ. 50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం 

రూ. 50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ లో 25 కిలోల డ్రగ్స్ ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ. 50 కోట్లు ఉంటుందని తెలిపారు. మెఫిడ్రిన్ తయారు చేసే 2 ల్యాబ్ లను అధికారులు సీజ్ చేశారు. ఈ ల్యాబ్ లను నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నది. డిసెంబర్ 21న హైదరాబాద్ లో డీఆర్ఐ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఈ ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడిని ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. రూ. 60 లక్షల నగదుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడుగురిలో కొందరిపై గతంలోనే డ్రగ్స్ తయారీ కేసులు ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. కొందరిపై హైదరాబాద్ లో హత్య కేసులు, వడోదరలో దోపిడీ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.