యూపీఎస్సీ ర్యాంకర్ మేఘనకు కేటీఆర్ సత్కారం

యూపీఎస్సీ ర్యాంకర్ మేఘనకు కేటీఆర్ సత్కారంహైదరాబాద్ : యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ 2020 తుది పరీక్ష ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 83వ రాంక్ సాధించిన వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన టీఎస్ఎస్పీడీసీఎల్ (TSSPDCL) డైరెక్టర్ కమర్షియల్ కె. రాములు కుమార్తె కావలి మేఘన రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ని ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భముగా మంత్రి కేటీఆర్ కావలి మేఘనను సత్కరించారు. సివిల్ సర్వీస్ లో మంచి ర్యాంకు సాధించినందుకు గాను కావలి మేఘనను అభినందించారు. మంత్రి కేటీఆర్ తో పాటు కార్మిక శాఖా మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్ రెడ్డి , కావలి మేఘన పెదనాన్న , బషీరాబాద్ మాజీ జెడ్పీటీసీ కే.భాస్కర్ లు కావలి మేఘనని అభినందించారు.