‘వాలి’ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న బోనీ కపూర్

అజిత్ ‘వాలి’ సినిమా రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న బోనీ కపూర్
కన్నడ, తమిళ్ మినహా అన్ని భాషల్లో రీమేక్

'వాలి' రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న బోనీ కపూర్హైదరాబాద్ : తమిళ్ సెన్సషనల్ స్టార్ అజిత్ కవల హీరోలుగా , తమిళ్ హీరో కం దర్శకుడు యస్ జె సూర్య తొలి చిత్రం ‘వాలి’. తెలుగు తమిళ్ భాషలలో 1999 లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రం ఇప్పటివరకు ఇతర ఇండియన్ లాంగ్వేజ్ లలో రీమేక్ కాలేదు.

తెలుగు లో ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ లో డబ్బింగ్ చిత్రంగా విడుదల అయ్యింది. అజిత్ ని అగ్ర హీరో గా స్టార్ డమ్ తెచ్చిన వాలీ చిత్ర హిందీ మరియు కన్నడ మినహా అన్ని బాషల రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నారు . వాస్తవానికి 2020 లో దక్కించుకున్న బోనీ కపూర్ ఆ చిత్ర దర్శకుడు ఎస్.జె సూర్య కోర్ట్ లో కేసు వేయడం మరియు కరోనా కారణంగా ఓ ఏడాది పాటు షూటింగ్ కై నిరీక్షించాల్సి వొచ్చింది.

ఎట్టకేలకు కోర్ట్ తీర్పు కూడా అనుకూలంగా రావడంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ కై శ్రీకారం చుట్టనున్నారు . ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని కపూర్స్ వెంచర్ మరియు నరసింహ ఎంటర్ ప్రైజస్ నిర్మించనున్నాయి. చీఫ్ జస్టిస్ సాజిబ్ బెనర్జీ మరియు జస్టిస్ పీ.డీ ఆదికేశవులు ఇచ్చిన తీర్పులో కాఫీరైట్ పైన నిర్మాతకు కూడా సంపూర్ణ హక్కులు వుంటాయని తెల్చేయడంతో అన్ని అడ్డంకులను తొలగించుకొని రీమేక్ కి  బోనీ కపూర్  సిద్ధమవుతున్నారు . ఇంకా నటి నటులు సాంకేతిక నిపుణులను నిర్ణయించని ఈ చిత్రం అతిత్వరలో ఓ నిర్ణయానికి వొచ్చి 2022 లో చిత్రనిర్మాణం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.