సిగ్గు సిగ్గు..కూతురిపై కన్నేసిన తండ్రి

సిగ్గు సిగ్గు..కూతురిపై కన్నేసిన తండ్రి

సిగ్గు సిగ్గు..కూతురిపై కన్నేసిన తండ్రి

వరంగల్ టైమ్స్, కాకినాడ : కన్న కూతురనే కనికరం కూడా లేకుండా మృగంలా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన కాకినాడ దుమ్ములపేటలో వెలుగు చూసింది.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తీరిది రాము(40),జయమ్మ దంపతులకు 15,10యేళ్ల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన రాము(40) ఎటువంటి పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. భార్య తెచ్చే సొమ్ముతో రోజు తాగుతుండేవాడు.

ఆర్ధిక భారం ఎక్కువ కావడంతో పిల్లలను ఉప్పాడలోని తల్లి ఇంటి వద్ద ఉంచి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. వేసవి సెలవులు కావడంతో గురువారం పిల్లలు తల్లి వద్దకు వచ్చారు. ఎప్పటిలానే చేపలు అమ్మడానికి వెళ్లిపోయింది.సొంత ఇంటికి ఎంతో ఆనందంగా వచ్చిన పెద్ద కూతురుపై కన్నేసిన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

రాత్రి సమయంలో భార్యను పని మీద బయటకు పంపి మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం తెలుసుకున్న భార్య తన భార్తను నిలదీసింది. ఈ విషయాన్ని బయటకు చెపితే చంపేస్తానని బెదిరించి ఇంట్లో ఉన్న వస్తువులు, బట్టలు అన్నింటీని కాల్చి వేశాడు. దీంతో భయబ్రాంతులకు గురైన ఆమె కూతురిని తీసుకుని కాకినాడ పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన డీఎస్పీ మురళీ మోహన్‌ విచారణ చేపట్టారు. బాలికను ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.