సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతితమిళనాడు : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన ధృవీకరించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ విల్లింగ్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నది. బిపిన్ రావత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ , ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే…
బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి డిఫెన్స్ విమానంలో కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ బేస్ కు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ , ఆయన భార్య మధులికా రావత్ సహా 9 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి కూనూరు కంటోన్మెంట్ కు ఆర్మీ హెలికాప్టర్ లో బిపిన్ రావత్ దంపతులతో పాటు 12 మంది ఆర్మీ ఆఫీసర్లు బయల్దేరారు. ఇక కూనూరు ఎయిర్ బేస్ లో మరో 5 నిమిషాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే కంటే ముందే చాపర్ కుప్పకూలిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు హెలికాప్టర్ కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు ధృవీకరించారు.సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతిఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా మధ్యాహ్నం 1.50 నిమిషాలకి ట్వీట్ చేసింది. ఈప్రమాదంలో బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలిపింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు బిపిన్ రావత్ మృతిని వాయుసేన అధికారికంగా ధృవీకరించి ట్వీట్ చేసింది.

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కూనూరు కంటోన్మెంట్ ఎందుకు వెళ్లారంటే..
కూనూరు కంటోన్మెంట్ లోని ఆర్మీ రీసెర్చ్ కేంద్రంలో బిపిన్ రావత్ ప్రసంగించాల్సి ఉండటంతో అక్కడికి వెళ్లారు. ఈ కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆర్మీ శిక్షణ కొనసాగుతోంది. ఆ కంటోన్మెంట్ ఏరియాకు చేరుకునే క్రమంలోనే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఇది ప్రమాదమా? విద్రోహమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.