నేటి నుంచే టీ 20 సిరీస్ ప్రారంభం

నేటి నుంచే టీ 20 సిరీస్ ప్రారంభంవరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్ తో టీ 20 సమరానికి టీమిండియా సిద్ధమైంది. నేటి నుంచి టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది. నేటి సాయంత్రం 7 గంటలకు మొదటి టీ 20 మ్యాచ్ జరుగనుంది. కోల్ కత్తలోని ఈడెన్ గార్డెన్ లో ఈ మ్యాచ్ జరుగనుంది. అలాగే ఈ నెల 18న రెండో టీ 20 , ఈనెల 20న మూడో టీ 20 జరుగనున్నాయి. వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేట సిరీస్ ను టీమిండియా ఇప్పటికే క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా టీ 20 సిరీస్ కూడా ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా ప్రయత్నిస్తుంది. కాగా వచ్చే సంవత్సరం టీ 20 వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్ కు ప్రాధాన్యత చోటు చేసుకుంది.

వరల్డ్ కప్ కు భారత్ సిద్ధం కావడానికి ఈ సిరీస్ మంచి అవకాశంగా ఉండనుంది. జట్టు లోపాలను సరి చేసుకోవడంతో పాటు ఆటగాళ్లపై ప్రయోగాలు చేయడం వంటి సవాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మపై ఉండనున్నాయి. అలాగే ఈ టీ 20 సిరీస్ పై ఐపీఎల్ మెగా వేలం ఎఫెక్ట్ కూడా చూసే చాన్స్ ఉండనుంది. మెగా వేలంలో కొంత మంది ఆటగాళ్లు రికార్డు ధర పలుకగా, మరికొందరు స్వల్ప ధరకే అమ్ముడుపోయారు. మరికొందరు అన్ సోల్డ్ గా అయ్యారు. దీని ప్రభావం ఈ సిరీస్ పై చూపకుండా ఉండాలని కెప్టెన్ రోహిత్ ఇప్పటికే ఆటగాళ్లను కూడా హెచ్చరించారని తెలుస్తోంది.