“అదానీ”పై జేపీసీ వేయాలి : బీఆర్ఎస్ ఎంపీలు

“అదానీ”పై జేపీసీ వేయాలి : బీఆర్ఎస్ ఎంపీలు

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : అదానీ సంక్షోభంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు చేపట్టాలని కోరుతూ నేడు పార్లమెంట్ ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ రెండో దఫా సమావేశాలు గత 5 రోజుల నుంచి సాగుతున్నా ఒక్కరోజు కూడా సభా కార్యక్రమాలు జరుగలేదు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ, రాజ్యసభల్లోనూ అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

“మోదానీ” వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, యుపీఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి పట్టుబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదానీ పాల్పడిన ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను జేపీసీ వేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఐదో రోజు కూడా పార్లమెంటు అట్టుడికింది. శుక్రవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్, డీఎంకే తదితర పక్షాలు అదానీ వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనంటూ పెద్ద పెట్టున నినాదాలిస్తూ పట్టుబట్టాయి."అదానీ"పై జేపీసీ వేయాలి : బీఆర్ఎస్ ఎంపీలుఅధికార పక్షం అందుకు ససేమిరా అనడంతో ఉభయ సభలల్లోని ప్రతిపక్షాలు సమావేశాలను బహిష్కరించి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు చేరి ఆందోళనకు దిగాయి. ప్రధాని మోడీ అండదండలతోనే అదానీ తీవ్ర ఆర్థిక నేరాలకు ఒడిగట్టారని వారు విమర్శించారు. అందుకే ఆయన వ్యవహారాలపై జేపీసీ వేయకుండా వెనకేసుకు వస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు.

మోడీ-అదానీల స్నేహాన్ని గుర్తు చేస్తూ “మోదానీ” అనే ప్లకార్డులను ప్రదర్శించారు. డప్పు చప్పుళ్లు చేస్తూ నినాదాలు చేశారు. “వేయాలి వేయాలి వెంటనే జేపీసీ వేయాలి”,”స్వస్తి పలకాలి స్వస్తి పలకాలి సీబీఐ, ఈడీ, ఐటీల దుర్వినియోగానికి వెంటనే స్వస్తి పలకాలి” అంటూ ఎంపీలు నేలపై బైటాయించి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అదానీ స్టాక్స్ ఇష్యూపై జేపీసీతో దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు."అదానీ"పై జేపీసీ వేయాలి : బీఆర్ఎస్ ఎంపీలుఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహూల్ గాంధీ, చిదంబరం, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, సహచర ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, కే.ఆర్.సురేష్ రెడ్డి, బీ.బీ.పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, పి.రాములు తదితరులతో కలిసి పాల్గొన్నారు.