ఎమ్మెల్సీ కవిత ఓటుపై బీజేపీ ఫిర్యాదు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారని ఫిర్యాదులో స్పష్టంచేసింది. అయితే కవితకు నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఓటుహక్కు ఉందని అక్కడి ఓటుతోనే ఆమె నిజామాబాద్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారని బీజేపీ నాయకులు ఆరోపించారు.అక్కడ ఓటు ఉండి హైదరాబాద్లోని బంజారాహిల్స్ చిరునామాతో మరోసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒటుహక్కు ఓటు వేయడం ఏంటని వారు విమర్శించారు. వెంటనే ఎన్నికల సంఘం స్పందించి ఎమ్మెల్సీ కవితను పదవి నుంచి డిస్ క్వాలిఫై చేయాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎస్ఈసీ తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోధన్ లోని తన ఓటును హక్కును రద్దు చేసుకుందని వివరణ ఇచ్చింది.