రేపు తెనాలిలో ఏపీ సీఎం జగన్ పర్యటన
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెనాలిలో సీఎం పర్యటించనున్నారు.
ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. ఉదయం 10.35 గంటలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుని నాలుగో ఏడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.