సుప్రీంలో మళ్లీ పిటిషన్ పై క్లారిటీ ఇచ్చిన కవిత

సుప్రీంలో మళ్లీ పిటిషన్ పై క్లారిటీ ఇచ్చిన కవిత

సుప్రీంలో మళ్లీ పిటిషన్ పై క్లారిటీ ఇచ్చిన కవితవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఈడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మరోసారి తాను పిటిషన్ దాఖలు చేశారని, దాన్ని న్యాయస్థానం తిరస్కరించిందంటూ జరుగుతున్న అసత్య ప్రచారంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. గురువారం నాడు మాత్రమే తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని, నేడు ఎలాంటి పిటిషన్ వేయలేదని స్పష్టం చేశారు. మహిళగా తనకు ఉన్న హక్కులను, వ్యక్తిగత గోప్యతను ఈడీ హరిస్తుందని, వాటిని కాపాడాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను 24న విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

ఇదిలా ఉంటే మార్చి 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈక్రమంలో 20వ తేదీలోపు తన పిటిషన్ పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును ఆర్జించింది. దీన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించిందని ఓ ప్రముఖ పత్రిక వార్తాకథనం వచ్చింది. తనపై తప్పుడు కథనాలు రావడంతో ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు వస్తుందని అన్నారు. ఈ రోజు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని స్పష్టం చేసింది ఎమ్మెల్సీ కవిత.