గ్రూప్-1 ప్రిలిమ్స్ & ఏఈఈ, డీఏవో ఎగ్జామ్స్ రద్దు

గ్రూప్-1 ప్రిలిమ్స్ & ఏఈఈ, డీఏవో ఎగ్జామ్స్ రద్దు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ , ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ను ఈ యేడాది జూన్ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఏఈ పేపర్ లీకేజీ కారణంగా సిట్ నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. గత సంవత్సరం సెప్టెంబర్ 16న గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ యేడాది జనవరి 22న ఏఈఈ, ఫిబ్రవరి 26న డీఏవో పరీక్షలను నిర్వహించారు. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.