ఇక్కడి జనం నన్ను గుండెల్లో పెట్టకున్నారు : వైఎస్ జగన్

ఇక్కడి జనం నన్ను గుండెల్లో పెట్టకున్నారు : వైఎస్ జగన్కడప జిల్లా : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ గురువారం కడప జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులో రూ. 515 కోట్లతో మొత్తం 8 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

వైఎస్సార్ చనిపోయాక కడప జిల్లా జనం నన్ను గుండెల్లో పెట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో 30 నెలల్లో ప్రజలకు రూ.320 కోట్లు బదిలీ చేశామని పేర్కొన్నారు. 22,212 మంది అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా రూ.515 కోట్లతో ప్రొద్దుటూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ప్రొద్దుటూరులో మైనార్టీలకు ఉర్దూ డిగ్రీ కళాశాల, ఎల్లాల ఆంజనేయస్వామి ఆలయం ఆధునీకరణకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కడప జిల్లాలో వరద బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చారు.