ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్వరంగల్ టైమ్స్,అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వైఎస్ జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో పని చేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వం హెచ్ఆర్ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 12 శాతం వున్న హెచ్ఆర్ఏను 16 శాతానికి ప్రభుత్వం పెంచింది. పార్వతీపురం, అమలాపురం, భీమవరం, బాపట్ల, పాడేరు,నరసరావు, రాయచోటి జిల్లా, పుట్టపర్తి, రాజమండ్రి జిల్లా ఉద్యోగులకు పెంపు వర్తించనుంది. ఇటీవల ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏను మంజూరు చేస్తున్నట్లు మే 1న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెండు జీవోలు విడుల చేసింది.

ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జీవో నం.66, పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ జీవో నం.67 తీసుకువచ్చారు. ఈ డీఏను ఈ సంవత్సరం జులై 1 నుంచి జీతంతో కలిపి ఇవ్వనున్నారు. డీఏ బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారని తెలుస్తోంది. తాజా డీఏతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ శాతం 22.75 కి పెరుగుతుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60 యేళ్లకు ఉన్న పదవి ఉద్యోగ విరమణను 62 యేళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టం 1982 సవరణ బిల్లును ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అలాగే ఏపి పబ్లిక్ లైబ్రరీల చట్టం 1962 సవరణ బిల్లు ద్వారా జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ కూడా 62 యేళ్లకు పెంచే విధంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు.