సైనా అవుట్ ! సింధుకు ఊహించని షాక్

సైనా అవుట్ ! సింధుకు ఊహించని షాక్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : భారత స్టార్ షట్లర్లకు జర్మన్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ లో 7వ సీడ్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ కంగుతినగా, పరుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ వరల్డ్ నంబర్ వన్, ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-18తో చైనాకు చెందిన లుగ్వాంగ్ జుపై గెలిచాడు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో చైనా ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్ లో శ్రీకాంత్ కు చివరకు నిరాశే ఎదురైంది.సైనా అవుట్ ! సింధుకు ఊహించని షాక్అయితే నిర్ణాయక మూడో గేమ్ లో జాగ్రత్తగా ఆడుతూ పై చేయి సాధించాడు. హెచ్.ఎస్. ప్రణయ్ 21-19, 24-22తో లీ చిక్ యూ ( హాంకాంగ్ ) పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్ లో శ్రీకాంత్ కు సిసలైన సవాలు ఎదురుకానుంది. ఒలింపిక్ చాంపియన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెసెన్ ( డెన్మార్క్ ) తో భారత స్టార్ తలపడనున్నాడు.

సింధు, సైనా ఔట్ !
ఉమెన్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సింధు 14-21, 21-15, 14-21 తో జాంగ్ యిమన్ ( చైనా ) చేతిలో కంగుతింది. వచ్చే వారం ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ కోసం కఠోరంగా శ్రమిస్తోన్న సింధుకు ఇది ఊహించని షాక్. అన్ సీడెడ్ ప్రత్యర్థిపై ఒక గేమ్ గెలిచినా, మిగతా రెండు గేముల్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

సుదీర్ఘకాలంగా ఫిట్ నెస్ సమస్యలెదుర్కొంటూ కెరీర్ కొనసాగిస్తున్న సైనా తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. థాయ్ లాండ్ స్టార్, ఎనిమిదో సీడ్ రత్చనోక్ ఇంతనొన్ 21-10, 21-15తో సైనాపై అవలీలగా గెలిచింది. 31 నిమిషాల్లోనే సైనాతో మ్యాచ్ ను ముగించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్ -గారగ కృష్ణప్రసాద్ జోడీ 23-21, 16-21, 21-14తో భారత్ కే చెందిన ఇషాన్ భట్నాగర్ – సాయిప్రతీక్ జంటపై గెలిచింది.