అమానుషం..పేషంట్ పై ఓ వ్యక్తి లైంగిక దాడి

అమానుషం..పేషంట్ పై ఓ వ్యక్తి లైంగిక దాడి

వరంగల్ టైమ్స్, విజయవాడ : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించిన ఘటన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. గత అర్ధరాత్రి మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించగా అది గమనించిన తోటి రోగులు,అటెండర్లు ఆ కామాంధుడి దుశ్చర్యను అడ్డుకున్నారు. తర్వాత మహిళా తరపు బంధుమిత్రులు నిందితుడిపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. బాధితురాలు మచిలీపట్నంకి చెందిన నాగలక్ష్మి (25)గా తెలుస్తోంది. కాగా నిందితుడు గుంటూరు కి చెందిన చంద్రశేఖర్‌ గా గుర్తించారు పోలీసులు. నిందితుడిపై 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక ప్రస్తుతం బాదిత మహిళ నాగలక్ష్మి పై వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాధితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.