తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ..!

తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ..!

తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ..!

వరంగల్ టైమ్స్,హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం నుంచి మంగళవారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్,మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది.