తెలంగాణ అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం

తెలంగాణ అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవంహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది. సీఎం కేసీఆర్ తో పాటు ఐటీ, పురపాలక, పరిశ్రమల, చేనేత – జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది.

అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే ఎక్కడా లేని విధంగా మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పీ.ఆర్.సి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత వస్త్రాలు అందించింది. నేడు హైదరాబాద్ లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కేటిఆర్, సత్యవతి రాథోడ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవ రాజన్ కలిసి ఈ చేనేత చీరలను అంగన్వాడీలకు అందించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత – జుట్ బ్యాగులను విడుదల చేశారు.

రాష్ట్రంలోని 31,711 మెయిన్ అంగన్వాడి కేంద్రాలు, 3989 మినీ అంగన్వాడి కేంద్రాలలోని 67,411 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు ఈ చేనేత చీరలు అందనున్నాయని మంత్రులు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అందించడం జరిగిందన్నారు. ఇప్పుడు తాజాగా మూడో జతగా చేనేత చీరలు అందించడం సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం

అంగన్వాడీ లకు గౌరవ ప్రదమైన వస్త్రాలు.. సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడి కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని అన్నారు. ప్రీ ప్రైమరీ విద్యను, పోషకాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీలకు అభినందనలు, ట్రాన్స్ జెండర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం తమ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ హామీ ఇచ్చారు.