జాతీయ స్థాయి కబడ్డీ 2వ రోజు పోటీలు ప్రారంభం

జాతీయ స్థాయి కబడ్డీ 2వ రోజు పోటీలు ప్రారంభంతిరుపతి : ఆధ్యాత్మిక నగరంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణ తిరుపతికే తలమానికమని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇందిరా మైదానంలో రెండవ రోజు కబడ్డీ లీగ్ పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తిరుపతి మేయర్ శిరీష పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి కబడ్డీ పోటీలను తిలకించారు. అంతకుముందు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ మహిళా క్రీడాకారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు అద్భుతంగా చేశారని చెవిరెడ్డి కొనియాడారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలో అందరి సమిష్టి కృషితో జాతీయ స్థాయి పోటీలు విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.