హైదరాబాద్ : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న పూర్తయింది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కోడ్ ముగియగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని అంటున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
కొన్ని జిల్లాల కలెక్టర్లు సహా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని, అదనపు బాధ్యతల్లో ఉన్న పలు పోస్టులకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించే అవకాశముందని తెలుస్తోంది. ఐపీఎస్ అధికారుల్లో ఎస్పీలు, కమిషనర్లు, సీనియర్ అధికారులను స్థానచలనం ఉంటుందని తెలుస్తోంది.
సర్కారుకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.