సీఎం కేసీఆర్ ను కలిసిన ఆ నలుగురు ఎమ్మెల్సీలు

సీఎం కేసీఆర్ ను కలిసిన ఆ నలుగురు ఎమ్మెల్సీలువరంగల్ టైమ్స్, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ లు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కి ఆ నలుగురు ఎమ్మెల్సీలు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.