అర్జెంటీనాపై భారత హాకీ జట్టు విక్టరీ 

అర్జెంటీనాపై భారత హాకీ జట్టు విక్టరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : చివరి నిమిషంలో గోల్ చేసిన మన్ దీప్ సింగ్ ప్రొ హాకీ లీగ్ లో భారత పురుషుల జట్టుకు ఐదో విజయాన్ని అందించాడు. ఎఫ్ ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ లో భాగంగా కళింగ హాకీ స్టేడియంలో అర్జెంటీనాతో ఆదివారం జరిగిన రెండో అంచె లీగ్ మ్యాచ్ లో భారత్ 4-3 గోల్స్ తేడాతో గెలిచింది. అర్జెంటీనాపై భారత హాకీ జట్టు విక్టరీ భారత డిఫెండర్ వరుణ్ కుమార్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తరపున హార్దిక్ సింగ్ ( 17వ ని.లో), మన్ దీప్ సింగ్ ( 60వ ని.లో ) ఒక్కో గోల్ చేయగా, జుగ్ రాజ్ సింగ్ ( 20వ, 52వ ని.లో ) రెండు గోల్స్ సాధించాడు. ఈ విజయంతో భారత్ తొమ్మిది జట్లు పాల్గొంటున్న ఈ లీగ్ లో 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.