తార‌క‌ర‌త్న మృతితో ‘యువగళం’ కి బ్రేక్

తార‌క‌ర‌త్న మృతితో ‘యువగళం’ కి బ్రేక్

వరంగల్ టైమ్స్, అమరావతి : నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతితో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, యువ‌నేత నారా లోకేష్ ‘యువ‌గ‌ళం’ పాద‌యాత్ర‌కి బ్రేక్ పడింది. తార‌క‌ర‌త్న‌కి నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు.

బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దంటూ నారా లోకేష్ ఆవేదనకు గురయ్యారు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటని తెల్పారు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది అంటూ తారకరత్నతో తనకున్న అనుబంధాన్ని నారా లోకేష్ గుర్తుచేసుకుంటూ క‌న్నీటి నివాళులు అర్పించారు.