సిబ్బంది శిక్షణ లోపమే కారణం
నేరేడ్మెట్ ఫలితంపై హైకోర్టు అభిప్రాయం
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ నేరేడ్మెట్ మినహా పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే నేరేడ్మెట్లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈక్రమంలో ఇతర ముద్రలు ఉన్న ఓట్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఈ తప్పిదానికి సిబ్బంది శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సోమవారం ఉదయం ఈ అంశంపై విచారణ జరుపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీచేసింది.