బాంబు పేలుళ్లు.. 19 మంది మృతి

బాంబు పేలుళ్లు.. 19 మంది మృతికాబూల్ : ఆఫ్ఘినిస్తాన్ రాజధాని కాబూల్ లోని పోలీస్ డిస్ట్రిక్ట్-10లోని మిలటరీ హాస్పిటల్ సమీపంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించింది. పోలీస్ డిస్ట్రిక్ట్-10లోని మిలటరీ హాస్పిటల్ సమీపంలో సంభవించిన రెండు బాంబు పేలుళ్ల ధాటికి 19 మంది మృత్యువాతపడగా, 50 మంది గాయపడ్డారు. మొదటి పేలుడు సర్దార్ మహ్మత్ దావూద్ ఖాన్ ఆస్పత్రి ముందు జరుగగా, రెండో పేలుడు సైతం ఆస్పత్రి పరిసరాల్లోనే జరిగినట్లు ఆఫ్ఘన్ కు చెందిన టోలో న్యూస్ వెల్లడించింది.

బాంబు పేలుళ్ల తర్వాత కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. గతంలోనే ఇదే ప్రాంతంలోనూ పేలుళ్లు జరిగాయి. ఆఫ్ఘన్ లో పేలుళ్లు సర్వసాధారణమే అయినా తాలిబన్లు ఆక్రమించిన అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. ఆగస్టులో ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ఆఫ్ఘనిస్తాన్ లోని మసీదులు, పలు ప్రాంతాలపై వరుసగా దాడులు చేస్తున్నది.