ఆరోగ్యంగా ఉండాలంటే..?

ఆరోగ్యంగా ఉండాలంటే..?

ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే…కార్డియాలజిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్ర౦

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుందని పడుకునే ముందు ఏమీ నీళ్లుతాగకూడదని అనకుంటున్నారా..? అయితే మీరు యమపురికి టికెట్​ బుక్​ చేసుకన్నట్టే.. అంటున్నారు ఓ ప్రముఖ కార్డియాలజిస్ట్.​ రాత్రిపూట నీళ్లుతాగకుండా పడుకుంటే శరీరంలో నీటి శాతం తక్కువై ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్రవిసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా! అంటున్నారు.ఆరోగ్యంగా ఉండాలంటే..? నిటారుగా నిలబడినప్పుడు సాధారణంగా కాళ్లలో వాపు ఉంటుంది (ముఖ్యంగా మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ) ఎందుకంటే గురుత్వాకర్షణ వల్ల మీ క్రింది భాగాల్లో, ముఖ్య౦గా కాళ్లలో ఎక్కువ నీళ్లునిల్వవుంటాయన్నారు. అదే, పడుకున్నప్పడు మీ దిగువ శరీరం (ట్రంక్, కాళ్లు మొదలైనవి) మీ మూత్రపిండాలతో సమంగా ఒకే ఎత్తులో ఉంటాయి కనుక మూత్రపిండాలు ఎక్కువ నీటిని తొలగించేదానికి సులభంగా ఉంటుంది. మూత్రంద్వారానే మన రక్తంలోని మలినాలు, విషపదార్థాలు విసర్జింపబడతాయని తెలిపారు. అటువంటప్పుడు నీళ్లు తాగడానికి సరైన సమయం ఇవ్వడం మంచిదే కదా అంటున్నారు. ప్రతి ఒక్కరూ 10 మందికి ఈ సందేశాన్ని పంపించగలిగితే కనీసం ఆ పది మందిలో ఒక ప్రాణాన్నైనా కాపాడుకోగలుగుతామని అంటున్నారు ఈ వైద్యులు.

హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు

1. ఉదయం మేల్కొన్న తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు తాగడంతో
అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది.
2. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడంవల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది.
3. స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు నీళ్లుతాగడ౦తో రక్తపోటు తగ్గించడానికి సహాయపడుతుంది.
4. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల గుండెపోటును నివారించవచ్చు
5. అదనంగా రాత్రి మధ్యలో నీరు తాగడం వల్ల రాత్రి కాలు తిమ్మిర్లను నివారించడానికి సహాయపడుతుంది.
6. కాలు కండరాలు సంకోచించడం (కొంకర్లు) చార్లీ హార్స్ లేక దూడ తిమ్మిరి అనే రోగం మన శరీరంలో నీటి శాతం తక్కువయినపుడు వస్తు౦ది. రోజంతా సరిగా నీళ్లు తాగడ౦ వల్ల ఈ వ్యాధి రాదు.