విజయవాడ : విజయవాడలో సినీ హీరో సాయి ధరమ్తేజ్ గురువారం సందడి చేశారు. షూటింగ్ నిమిత్తం వచ్చిన ఆయన పట్టణంలోని వాంబేకాలనీలోని అమ్మప్రేమ ఆదరణ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అభిమానులు వృద్ధాశ్రమానికి సాయం చేయమని కోరగా స్పందించిన హీరో ఆరులక్షల విరాళం అందించాడు. అంతేగాకుండా తన స్నేహితుల సాయాన్ని కూడా అందించినట్లు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో అభిమానుల సహకారంతో మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కరోనా అన్లాక్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సినిమాహాళ్లకు అనుమతి ఇవ్వడం హర్షణీయమన్నారు. త్వరలోనే తాను నటించిన సినిమా ‘సోలోబతుకే సోబెటర్’ సినిమా విడుదల కానుందని చెప్పారు. పైరసీని తరమికొట్టి సినిమాహాళ్లలో సినిమా చూసి ఆదరించాలని ఆయన అభిమానులను కోరారు.