ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా బుధ‌వారం నోటిఫికేషన్ జారీ చేశారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అయితే ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.