పులివెందులలో ‘అపాచీ’

పులివెందులలో ‘అపాచీ’కడపజిల్లా : లభించనున్నాయి. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపను ఇండస్ట్రియల్ జోన్‌గా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఫుట్‌వేర్ మాన్యుఫాక్చరర్ అయిన అపాచీ ఇంటెలిజెంట్ సెజ్‌కు సీఎం జగన్ డిసెంబర్ 24న పులివెందులలో శంకుస్థాపన చేయనున్నారు. లెదర్ ఇండస్ట్రీలో అపాచీ రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా…2 వేల మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. పట్టణంలోని ఇండస్ట్రియల్ డెవలప్‌‌మెంట్ పార్కులో జేఎన్టీయూ కాలేజీ వెనుక భాగంలో అపాచీ కోసం 27.94 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ స్థలాన్ని గతవారం సంస్థ ప్రతినిధులకు పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ స్పెషల్ ఆఫీసర్ అనిల్ కుమార్ రెడ్డి చూపించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఇనగలూరులో అపాచీ కార్యకలాపాలు సాగిస్తోంది. కడప జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సీఎం కట్టుబడి ఉన్నారని జిల్లా కలెక్టర్ హరికిరణ్ పునరుద్ఘాటించారు. కాగా సీఎం జగన్ డిసెంబర్ 25న తన సొంతూరైన పులివెందులలో క్రిస్మస్ పండుగ జరుపుకోనున్నట్లు అధికారులు తెలిపారు