ప్రాణం తీసిన సెల్ ఫోన్

ప్రాణం తీసిన సెల్ ఫోన్వికారాబాద్ జిల్లా: సెల్ ఫోన్ లో గేమ్ లు ఆడవద్దని మందలించినందుకు బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన అనంతయ్య కుమారుడు ముక్తానందు ప్రతిరోజు ఎక్కువగా సెల్ ఫోన్లు గేములు ఆడుకునే వాడు బుధవారం సైతం ఇంటిలోకి మంచినీరు పట్టాలని, షాప్ దగ్గర ఉండాలని సూచించగా నేను రాను అని సమాధానం ఇవ్వడంతో తండ్రి మందలించడం జరిగింది దీంతో మనస్థాపానికి గురైన బాలుడు ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గ్రామంలో విషాదఛాయలు 9వ తరగతి చదువుతున్న ముక్తానందు ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి గురువారం జడ్పీహెచ్ఎస్ బండవెల్కిచర్ల పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు నివాళులర్పించారు. అందరితో కలివిడిగా ఉంటూ చదువు పరంగా ఉత్సాహంగా ఉండే బాలుడు ఈ విధంగా మృతి చెందడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.