గుంటూరు జిల్లా : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ రైడ్స్ నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి సంబంధించిన పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాయపాటి కుటుంబ సభ్యులను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.