ఐఏఎంసీని ప్రారంభించిన సీజీఐ రమణ, కేసీఆర్

ఐఏఎంసీని ప్రారంభించిన సీజీఐ రమణ, కేసీఆర్హైదరాబాద్ : నానక్ రామ్ గూడాలోని వీకే టవర్స్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఐఏఎంసీ వెబ్ సైట్ ఆవిష్కరించారు.

దేశంలోనే తొలి ఐఏఎంసీ హైదరాబాద్ లో ఏర్పాటైంది. నానక్ రామ్ గూడలోని ఫోనిక్స్ వీకే టవర్స్ లో 25వేల చదరపు అడుగులలో ఐఏఎంసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐఏఎంసీ కేంద్రాన్ని సీజేఐకి అప్పగించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఐఏఎంసీ ఏర్పాటు అవుతోంది. ఐఏఎంసీ శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు పూర్తయ్యాయి.

ఈ కార్యక్రమంలో ట్రస్టీలు..సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్ రావు, జస్టిస్ హిమాకోహ్లీ, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ , హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, న్యాయశాఖ మత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.