నేడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు

హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకుడు. ఎక్కువగా హాస్య చిత్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయన నటించిన సినిమాలలో అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరును తెచ్చిపెట్టాయి. రాజేంద్ర ప్రసాద్ 1956 జూలై 19 న జన్మించారు. తల్లిదండ్రులు గద్దె వెంకటనారాయణ, మాణిక్యాంబ.నేడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజురాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గర్లోని దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతను బాల్యం, యవ్వనంలో అప్పుడప్పుడూ ఎన్. టి. ఆర్ స్వస్థలమైన నిమ్మకూరులోని ఇంటికి తరచుగా వెళ్ళి వస్తుండేవాడు. అలా చిన్నప్పటి నుంచే అతనికి ఎన్. టి. ఆర్ ప్రభావం పడింది. సినీ పరిశ్రమలో ప్రవేశించక మునుపు సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లోమా పూర్తి చేశారు.

ఎన్టీఆర్ తో చిన్నప్పటి నుంచి ఉన్న పరిచయంతో నటనపై ఆసక్తిని గమనించి ఆయనే చెన్నైలోని ఓ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేర్పించారు. ఎన్టీయార్ సలహాతోనే 1977లో సినిమాల్లో ప్రవేశించారు రాజేంద్ర ప్రసాద్. నటుడిగా తొలిచిత్రం బాపు దర్శకత్వంలో ‘స్నేహం’ 1977 సెప్టెంబరు 5 న విడుదలైంది. ఆ తర్వాత మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. నటుడిగా వివిధ భాషలలో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్రప్రసాద్ ‘ప్రేమించు పెళ్లాడు’ సినిమాతో హీరోగా మారారు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించారు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్రప్రసాదుది.నేడు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజుతెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించాడు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటారు. ‘మేడమ్’ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు ఏప్రిల్, 2015 లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎంతో హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికలలో రాజేంద్రప్రసాద్, జయసుధలు అధ్యక్ష పదవికి పోటీపడగా తీవ్ర ఉత్కంఠ మధ్య వెలువడిన ఫలితాలు జయసుధ, మురళీమోహన్ లకు షాక్ నిచ్చాయి. జయసుధ గెలుపు ఖాయమని అందరూ భావించినప్పటికీ రాజేంద్రప్రసాద్ గెలుపు అనూహ్యంగా తోచింది. రాజేంద్రప్రసాద్ 83ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. రాజేంద్రుడి ప్యానల్ లోని శివాజీ రాజా, కాదంబరి కిరణ్ కూడా గెలుపొందారు. రాజేంద్ర ప్రసాద్ నట జీవితంలో అనేక పురస్కారాలు అందుకున్నారు.

ఎర్రమందారం సినిమాలో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం – 1991 అందుకున్నారు.

మేడమ్ సినిమాలో నటనకు గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు – 1994లో అందుకున్నారు.

‘ఆ నలుగురు’ సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు – 2004 లో అందుకున్నారు.రాజేంద్ర ప్రసాద్ ‘టోపీ రాజా స్వీటీ రోజా’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.