మెగాస్టార్ ను పరామర్శించిన సీఎం కేసీఆర్

మెగాస్టార్ ను పరామర్శించిన సీఎం కేసీఆర్హైదరాబాద్ : కరోనా బారినపడిన మెగాస్టార్ చిరంజీవిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్, ఆయన ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తనకు మరోసారి కరోనా నిర్ధారణ అయినట్లు బుధవారం చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్భంధంలో ఉన్నారు.

‘కరోనా బారినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్పంగా లక్షణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను ‘ అని చిరంజీవి ట్వీట్ చేశారు.