హైదరాబాద్: అహ్మదాబాద్లో డే అండ్ నైట్ టెస్ట్ జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించారు. టీమిండియాతో ఇంగ్లండ్ నాలుగు టెస్ట్లు, మూడు వన్డేలు , ఐదు టీ20లు ఆడనుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7 వతేదీన టూర్ మొదలు కానున్నది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రెండు జట్ల మధ్య డే అండ్నైట్ టెస్ట్ జరుగనుంది. కరోనా వల్ల భారత్లో అంతర్జాతీయ క్రికెట్కు బ్రేక్ పడింది. మార్చిలో సౌతాఫ్రికాజట్టుతో జరగాల్సిన సిరీస్ను రద్దు చేశారు. ఇక ఇండియన్ ప్రీమియర్లీగ్ను దుబాయ్లో నిర్వహించిన సంగతి విదితమే. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియాలో టూర్ చేస్తుంది.కాగా ఇంగ్లండ్తో జరిగే డే అండ్ నైట్ టెస్ట్ కొత్తగా నిర్మించిన మోతెరా స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జేషా తెలిపారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్తో జరిగే క్రికెట్ సిరీస్ను కేవలం మూడు వేదికల్లో మాత్రమే నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
షెడ్యూల్ ఇదే..
తొలిటెస్టు, చెన్నైలో..ఫిబ్రవరి 5 నుంచి 9వరకు
రెండో టెస్టు, చెన్నైలో..ఫిబ్రవరి13 నుంచి17 వరకు
మూడోటెస్టు, అహ్మదాబాద్లో ..ఫిబ్రవరి24 నుంచి 28 వరకు
నాలుగో టెస్ట్, అహ్మదాబాద్లో.. మార్చి 4 నుంచి8 వరకు
ఐదు టీ20 మ్యాచ్లను అహ్మదాబాద్లో మార్చి 12,14,16,18,20 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక వన్డే మ్యాచ్లు పుణె వేదికగా జరుగనున్నాయి. మార్చి 23,26,28 వ తేదీల్లో వన్డే మ్యాచ్లు ఉంటాయని బీసీసీఐ కార్యదర్శి జేషా వెల్లడించారు.