మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల

మ్యాచ్ ల షెడ్యూల్ విడుదలహైదరాబాద్​: అహ్మదాబాద్​లో డే అండ్​ నైట్​ టెస్ట్​ జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్​ను ప్రకటించారు. టీమిండియాతో ఇంగ్లండ్​ నాలుగు టెస్ట్​లు, మూడు వన్డేలు , ఐదు టీ20లు ఆడనుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7 వతేదీన టూర్​ మొదలు కానున్నది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రెండు జట్ల మధ్య డే అండ్​నైట్​ టెస్ట్​ జరుగనుంది. కరోనా వల్ల భారత్​లో అంతర్జాతీయ క్రికెట్​కు బ్రేక్​ పడింది. మార్చిలో సౌతాఫ్రికాజట్టుతో జరగాల్సిన సిరీస్​ను రద్దు చేశారు. ఇక ఇండియన్​ ప్రీమియర్​లీగ్​ను దుబాయ్​లో నిర్వహించిన సంగతి విదితమే. ప్రస్తుతం ​ భారత్​ ఆస్ట్రేలియాలో టూర్​ చేస్తుంది.కాగా ఇంగ్లండ్​తో జరిగే డే అండ్​ నైట్​ టెస్ట్​ కొత్తగా నిర్మించిన మోతెరా స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ కార్యదర్శి జేషా తెలిపారు. కోవిడ్​ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్​తో జరిగే క్రికెట్​ సిరీస్​ను కేవలం మూడు వేదికల్లో మాత్రమే నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.

షెడ్యూల్​ ఇదే..
తొలిటెస్టు, చెన్నైలో..ఫిబ్రవరి 5 నుంచి 9వరకు
రెండో టెస్టు, చెన్నైలో..ఫిబ్రవరి13 నుంచి17 వరకు
మూడోటెస్టు, అహ్మదాబాద్​లో ..ఫిబ్రవరి24 నుంచి 28 వరకు
నాలుగో టెస్ట్​, అహ్మదాబాద్​లో.. మార్చి 4 నుంచి8 వరకు
ఐదు టీ20 మ్యాచ్​లను అహ్మదాబాద్​లో మార్చి 12,14,16,18,20 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక వన్డే మ్యాచ్​లు పుణె వేదికగా జరుగనున్నాయి. మార్చి 23,26,28 వ తేదీల్లో వన్డే మ్యాచ్​లు ఉంటాయని బీసీసీఐ కార్యదర్శి జేషా వెల్లడించారు.