దేశంలో తొలిసారి లిథియం నిల్వల గుర్తింపు 

దేశంలో తొలిసారి లిథియం నిల్వల గుర్తింపు

దేశంలో తొలిసారి లిథియం నిల్వల గుర్తింపు 

వరంగల్ టైమ్స్, హావేరి జిల్లా : దేశంలో తొలిసారిగా లిథియం నిల్వలను జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ( జీఎస్ఐ) గుర్తించిందని గురువారం కేంద్ర గనుల శాఖ అధికారికంగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లో భారీగా రియాసీ జిల్లాలో సలాల్-హైమనా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఈవీ బ్యాటరీల్లో ఉపయోగించేది లిథియంనే. మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం మేలు చేయనుంది. బంగారం, లిథియం సహా మొత్తం 51 గనులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినట్లు గనుల శాఖ వెల్లడించింది.