అమరావతి : ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ధర్మాసనం సమర్థించింది. గతేడాది ఏప్రిల్ 8న జరిగిన పరిషత్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు పాటించలేదని.. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ తీర్పును సవాలు చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం.తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.