రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఓ నిరుపేద వృద్ధుడు

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఓ నిరుపేద వృద్ధుడు

వరంగల్ టైమ్స్, ఝార్ఖండ్ : రాత్రికి రాత్రే కోటీశ్వరులం కావాలంటే.. ఏదైనా అద్భుతం జరగాలి. ‘కౌన్​ బనేగా కరోడ్​పతి’ వంటి ప్రోగ్రామ్​లో విజేతగా నిలవడమో.. లేక విలువైన వజ్రాలు దొరకడం లాంటి అదృష్టం వరించాలి. కానీ ఇవేవీ జరగకుండానే ఝార్ఖండ్​లో ఓ నిరుపేద వృద్ధుడు కోటీశ్వరుడయ్యాడు. అది ఎలాగంటే..?రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఓ నిరుపేద వృద్ధుడువివరాల్లోకి వెళ్లితే… ఝార్ఖండ్​ దుమ్కా జిల్లాలో ఓ నిరుపేద వృద్ధుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అతని పెన్షన్​ అకౌంట్​లో సుమారు రూ.75 కోట్లపైనే జమ అయింది. జిల్లాలోని జార్ముండి మండలంలోని సాగర్ గ్రామంలో ఫూలో రాయ్ తన కుమారుడు, భార్యతో కలిసి ఓ పూరి గుడిసెలో నివసిస్తున్నాడు. గ్రామంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

రాయ్​కినారిలోని సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో ఇతనికి అకౌంట్ ఉంది. పెన్షన్​ డబ్బులు తీసుకోవడానికి సమీపంలోని రూరల్ సర్వీస్ సెంటర్​కు వెళ్లాడు ఫూలో రాయ్​. రూ.10,000 విత్​డ్రా చేసుకున్నాడు. కానీ అకౌంట్​లో మిగిలిన డబ్బులు చూసి అవాక్కయ్యాడు. అకౌంట్​లో రూ.75.28 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తనకూ తెలియదని చెప్పాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు.