అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్హైదరాబాద్ : నగరంలో మరోసారి గంజాయి సరఫరా చేస్తున్న అంత‌రాష్ట్ర ముఠా గుట్టు ర‌ట్ట‌ైంది. సైబరాబాద్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.55,03,200 /- విలువ ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీలో సీక్రెట్ గా అమర్చి ఉన్న క్యాబిన్ లో గంజాయి ని తరలిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుండి 265 కేజీల గంజాయిని, 1 వాహనాన్ని, నగదు 3200 వేలు, 2 మొబైల్స్ 2, సీజ్ చేశామన్నారు. నిందితుల పైన ఎన్డీపీఎస్ యాక్ట్ క్రింద నమోదు చేస్తామన్నారు.