భారత్ ఆలౌట్.. సౌతాఫ్రికా టార్గెట్ 244

స్పోర్ట్స్ డెస్క్ : వాండరర్స్ టెస్టులో సఫారీల టార్గెట్ సెట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో పుజారా (53), రహానే (58) రాణించడంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన భారత్ , మిగతా బ్యాట్స్ మెన్స్ విఫలమవడంతో సఫారీల ముందు భారీ టార్గెట్ ఉంచలేకపోయింది. హనుమ విహారి ( 40 నాటౌట్) నిలదొక్కుకున్నా, చివరిలో అతనికి సహకరించే వాళ్లు లేకపోయారు.

సిరాజ్ (0)ను అవతలి ఎండ్ లో ఉంచి కొంతసేపు విహారి పోరాడాడు. ఇన్నింగ్స్ 60వ ఓవర్ చివరి 2 బంతులకు రెండో బౌండరీలు బాదాడు. ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికే సిరాజ్ ను ఎన్గిడీ బౌల్డ్ చేశాడు. దీంతో 266 పరుగుల వద్ద ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.

దీంతో సఫారీల ముందు 240 పరుగుల టార్గెట్ నిలిచింది. భారత బ్యాటర్లలో పుజారా (53), రహానే(58), విహారి(40 నాటౌట్), మయాంక్ అగర్వాల్(23), కేఎల్ రాహుల్ (8), పంత్ (0), అశ్విన్ (16), శార్దూల్ ఠాకూర్ (28), షమీ (0), బుమ్రా (7), సిరాజ్ (0) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 3, రబాడ 3, ఎన్గిడీ 3 వికెట్లు తీయగా, ఆలివియర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.