జయభేరి మోగించిన గుజరాత్ టైటన్స్ 

జయభేరి మోగించిన గుజరాత్ టైటన్స్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఈ సీజన్ లో తమకు ఎదురైన ఏకైక ఓటమికి గుజరాత్ టైటన్స్ ప్రతీకారం తీర్చుకుంది. తమను ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి ఓవర్ లో 22 రన్స్ చేయాల్సిన స్థితిలో రషీద్ ఖాన్ 3 సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. సన్ రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మినహా ఎవరూ వికెట్లు తీయలేకపోయారు. మాలిక్ ఒక్కడే 5 వికెట్లతో సత్తా చాటాడు. కానీ మిగతా బౌలర్లు విఫలం కావడంతో గుజరాత్ జట్టు 5 వికెట్ల తేడాతో ఆఖరి బంతికి విజయం సాధించింది.జయభేరి మోగించిన గుజరాత్ టైటన్స్ భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ కు వృద్ధిమాన్ సాహా (68) శుభారంభం అందించాడు. శుభ్ మన్ గిల్ (22) పర్వాలేదనిపించగా, హార్దిక్ పాండ్యా (10), డేవిడ్ మిల్లర్ (17), అభినవ్ మనోహర్ (0) ఫెయిలయ్యారు. అయితే రాహుల్ తెవాటియా ( 21 బంతుల్లో 40 నాటౌట్ ), రషీద్ ఖాన్ కలిసి గుజరాత్ ను గట్టెక్కించారు. సన్ రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే 5 వికెట్లతో సత్తా చాటాడు. మిగతా బౌలర్లు వికెట్లు లేకుండానే మ్యాచ్ ముగించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు చేసిన గుజరాత్ జయభేరి మోగించింది.