ఎమ్మెల్సీగా మధుసూదనాచారి ప్రమాణస్వీకారం

ఎమ్మెల్సీగా మధుసూదనాచారి ప్రమాణస్వీకారం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మధుసూదనాచారికి మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

ఎమ్మెల్సీగా మధుసూదనాచారి ప్రమాణస్వీకారం
మధుసూదనాచారి రాజకీయ ప్రస్థానం..
1982లో టీడీపీలో చేరిన మధుసూదనాచారి 1994-1999 మధ్యకాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో మధుసూదనాచారి ఒకరు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నూతన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు.