బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు భారీ షాక్

బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు భారీ షాక్హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ‌ అరవింద్ లకు భారీ షాక్ తగిలింది. వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసితో పాటు, బీజేపీ నాయకత్వం మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో, నందిపేట ఎంపీటీసి-2 అరుణ చావన్ గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో ఎంపీ బండి సంజయ్ ను, ఆ పార్టీ కార్యకర్తలే నమ్మడం లేదనే విషయం మరోసారి స్పష్టమైంది. ఇటీవల ఆర్మూర్ లో పర్యటించిన ఎంపీ అరవింద్ ను స్థానిక పసుపు రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీని నెరవేర్చాలంటూ ఎంపీ అరవింద్ ను నిలదీశారు. దీంతో కొందరు అరవింద్ ‌మనుషులు రైతులపై దాడికి ప్రయత్నించారు. అయితే అరవింద్ ను అడ్డుకున్న పసుపు రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చిన ఎంపీ బండి సంజయ్, ఆర్మూర్ లోని నందిపేటలో పర్యటించారు.

అయితే రైతులను ఉగ్రవాదులతో పోల్చి రాజకీయ లబ్ది కోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ తీరును గ్రామ బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా గ్రామ ఎంపీటీసి,ఇతర బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. తమను ఎంపీ అరవింద్ తీవ్రంగా మోసం చేసారని రైతులు అవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నందిపేట ఎంపీటీసి అరుణ ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పసుపు బోర్డు పేరుతో గెలిచి, రైతులను తీవ్రంగా మోసం చేసిన ఎంపీ అరవింద్, బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికలలో డిపాజిట్ కూడా రాదని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ జెడ్పీటీసీ యమునముత్యం, ఎంపీటీసి మురళి, టీఆర్ఎస్ పార్టీ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, అయిలాపూర్ సుదర్శన్, సిలిండర్ లింగం తదితరులు పాల్గొన్నారు.