ప్రగతి భవన్ ముట్టడి..70 మంది టీచర్లు అరెస్ట్

ప్రగతి భవన్ ముట్టడి..70 మంది టీచర్లు అరెస్ట్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 317 జీవో రద్దు చేయాలనే డిమాండ్ తో నేడు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. అయితే ఈ క్రమంలోనే 70 మందికి పైగా టీచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. 317 జీవో రద్దు చేయాలంటూ ప్రగతి భవన్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న టీచర్లను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల స్థానికత కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. 317 జీవోను సవరించే దాకా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా నిలుస్తుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. 317 జీవోను సవరించేదాకా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పోరాటాలను తీవ్రతరం చేస్తామని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.