నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ2

నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ2

వరంగల్ టైమ్స్, తిరుపతి : చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ని ఇస్రో ప్రయోగించింది. ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ( షార్ ) నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ2ఈ వాహకనౌక 156.3 కిలోల బరువున్న ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

మొదట 450 కిలో మీటర్ల ఎత్తులో ఈవోఎస్-07 ఉపగ్రహాన్ని, అనంతరం జానుస్-1, ఆజాదీశాట్ ను కక్ష్యలో ప్రవేశపెడుతుంది. మొత్తం 15 నిమిషాల్లో ప్రయోగం పూర్తికానుంది.