అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష

అభివృద్ధి పనుల ప్రగతిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షజనగామ జిల్లా : పాలకుర్తి-బమ్మెర-వల్మిడి కారిడార్ పనుల ప్రగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, బమ్మెర పోతన స్మారక మందిరం, వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. గతంలో సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పాలకుర్తికి రూ.10కోట్లు, బమ్మెరకు రూ.7.50 కోట్లు, వల్మీడికి రూ.5కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.